అప్పుల బాధతో దళిత,కౌలు రైతు మృతి.

భారత్ న్యూస్:
అప్పుల బాధతో దళిత,కౌలు రైతు మృతి..

కూడేరు ఏప్రిల్ 2 (భారత్ న్యూస్ ) స్థానిక మండల కేంద్రం సమీపంలోని,కడదరకుంట గ్రామానికి చెందిన హరిజన సంగప్ప తండ్రి ఆదెన్న, నిన్నటి దినంసోమవారం మధ్యాహ్నం తోటకు వెళ్లి అక్కడే చెట్టుకి ఉరివేసుకొని చనిపోయినాడు సంగప్ప భార్య మంజుల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త వ్యవసాయపంట సాగు చేయడానికి చేసిన అప్పులు ఎక్కువ కావడంతో వ్యవసాయమునకు పెట్టిన పెట్టబడి కూడా చేతికి రాకపోగా చేసిన అప్పులు ఎక్కువ పెరగపోవడంతో గ్రామంలోని పలు వ్యక్తుల రైతుల దగ్గర అప్పులు చేసి సాగు చేసిన పంటలు సరిగా పండక, చేసిన అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో తెలియక ఉరి వేసుకుని మరణించినట్లు భార్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిఐ శివరాముడు తెలిపారు, మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నట్లు సమీప బంధువులు తెలియజేస్తూ మరణించిన దళితరైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు..