సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-

భారత్ న్యూస్ నాగాయలంక

సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:- అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు..

ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు…

ఈరోజు నాగాయలంక మండలం, ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుమొండి, ఏసుపురం, కృష్ణాపురం, జింకపాలెం, గొల్లమంద, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, మళ్లీ గడప వద్దకే సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటును అభ్యర్థించారు…

ఈ సందర్భంగా నాగాయలంక మండల, వైసీపీ నాయకులు భోగాది శేషగిరిరావు గారు, మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలో టిడిపి నాయకులు ఎక్కువ ఉన్నారు వైసీపీకి మెజార్టీ తగ్గుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని, ఏ నాయకులు ఎటువైపు ఉన్న ఓటర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, మచిలీపట్నం పార్లమెంట్, అవనిగడ్డ అసెంబ్లీ ఈ రెండు స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో కంటే అత్యధిక మెజార్టీ వైసీపీ సాధిస్తుందని అన్నారు..