కూటమి ప్రభుత్వంతోనే మహిళాభ్యున్నతి..
భారత్ న్యూస్ అవనిగడ్డ కూటమి ప్రభుత్వంతోనే మహిళాభ్యున్నతి.. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ ఉపసభాపతి, ఎన్డీయే కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం అవనిగడ్డ లోని బీసీ కాలనీ కు చెందిన మహిళలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బీసీ కాలనీకి చెందిన భారతి, నాగమల్లేశ్వరి, హారిక, మంగ, చింతా శివ, చైతన్య, సుధీర్,…