జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.

భారత్ న్యూస్:
జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు..

కూడేరు ఏప్రిల్ 2(భారత్ న్యూస్) స్థానిక మండల కేంద్రం లోని జాతీయ రహదారి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సమీపంలోని భారీగా పెరిగిపోయిన ఎండలతో ప్రజల దాహార్తి తీర్చడానికి జాగృతి ఫౌండేషన్ సహకారంతో మంగళవారం కలగళ్ల రోడ్డు సమీపంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగినది.
ఇందులో భాగంగా చలివేంద్ర ప్రారంభోత్సవానికి, ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవికుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రవి, జాగృతి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు శిరీష, ఆంజనేయులు, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, జాగృతి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అసలే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయని, ప్రయాణికులు కు వాహనదారులకు సామాన్య ప్రజలకు చల్లని త్రాగునీటి సరఫరా చేయాలని ఉద్దేశంతో గత సంవత్సరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, జగతి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు, చలివేంద్రం ఏర్పాటు పై ప్రజలు జాగృతి ఫౌండేషన్,వారికిధన్యవాదములు తెలియజేశారు,