గ్రామ సచివాలయ వాలంటరీ కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ స్నేహితులు..

కూడేరు ఏప్రిల్ 24 (భారత్ న్యూస్ ) మండల పరిధిలోని అంతర గంగా గ్రామ సచివాలయం వాలంటీర్ తేజస్విని భర్త మహేష్ బస్సు యాక్సిడెంట్ వలన మృతి చెందడం జరిగినది, ఈ విషయం తెలుసుకున్న మహేష్ క్లాస్మేట్ 2020,21 సంవత్సరం కూడేరు జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ నందు విద్యను అభిశించిన పూర్వ విద్యార్థులు స్నేహితులు కలిసి మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం మహేష్ భార్య తేజస్వినికి బుధవారం అంతర గంగా గ్రామమునకు మహేష్ కుటుంబాన్ని పరామర్శించిఇంటికి వెళ్లి దాదాపు ఒక లక్ష 50 వేల రూపాయలు 40 మంది మహేష్ స్నేహితులు మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా స్నేహితుడు మహేష్ చాలా మంచి మిత్రుడు అని అందరితో స్నేహభావం కలిగిన వ్యక్తిని అతనిని కొడియాడారు, మహేష్ లేని లోటు వారి భార్యా పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదని కలిసి మా వంతు సహాయము మా స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్మించుకోవడంతో ఈ ఆర్థిక సహాయం చేయడం జరిగిందని వారి విలేకరులకు తెలియజేశారు..

ఫోటో రైట్ అప్.. ఆర్థిక సహాయం చేస్తున్న మహేష్ స్నేహితులు..