మీ ఓటు హక్కుతో ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వండి,,~~ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

మీ ఓటు హక్కుతో ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వండి

~~ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

(భారత్ న్యూస్;;; పత్తికొండ) తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరో మారు ఎమ్మెల్యేగా మీ అమూల్యమైన ఓటు హక్కుతో విజయాన్ని అందించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ నాయకులకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి చేయడం చంద్రబాబుకు నచ్చదని, అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు నిత్యం అడ్డుపడుతూ వచ్చారని గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎక్కడా ఆపలేదన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే టీడీపీ నాయకులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.జగనన్న పాలనలో మేలు జరిగిఉంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎంపీగా బీవై రామయ్యను, ఎమ్మెల్యేగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారేళ్ళ గ్రామం, మరియు తుగ్గలి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..