కామినేనికి మద్దతుగా కైకలూరులో నారా రోహిత్ ప్రచారం,,,,

కామినేనికి మద్దతుగా కైకలూరులో నారా రోహిత్ ప్రచారం
(భారత్ న్యూస్), మే 7, కైకలూరు :
కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కి మద్దతుగా సినీనటులు నారా రోహిత్, రోలర్ రఘు, పంచ్ ప్రసాద్ కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నారా రోహిత్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి శూన్యం చేసాడన్నారు. పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని అమరావతి కావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు. మన భవిష్యత్ మన చేతిలోనే ఉందన్నారు. సరైన నాయకున్ని ఎన్నుకుని, ఎన్డిఎ కూటమి అభర్థులను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కైకలూరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.