సంక్షేమం – అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం,,

సంక్షేమం – అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం
ఇంగిలింపాకలంక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సి జయమంగళ వెంకటరమణ
(భారత్ న్యూస్), మే 7, మండవల్లి :
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన కొనసాగాలంటే మరలా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్సి జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఇంగిలింపాకలంక గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారి. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు ఇంటివద్దకే వచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి సుపరిపాలన చేస్తున్న జగన్నన్నను ముఖ్యమంత్రిని చేసుకోవలసిన బాధ్యత మనందరిదేనన్నారు. జగనన్న బలపరిచిన వైసీపి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి దూలం నాగేశ్వరావు, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దిరెడ్డి రాము, గుమ్మడి వెంకటేశ్వరరావు, నుచ్చుమిల్లి సర్పంచ్ సైదు చంద్రయ్య, పెంచికలమర్రు సర్పంచ్ జయమంగళ కాసులు,గుమ్మళ్లపాడు సర్పంచ్ నాగేశ్వరావు, నాయకులు దాసరి అబ్రహం లింకన్, బసవయ్య, మోరు జాన్ యేసు, ఘంటసాల జోగిరాజు, జయమంగళ కొండలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.