…. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు,,,,

భారత్ న్యూస్ గుడివాడ……

…రుణ మాఫీ కాంగ్రెస్ గ్యారంటీ

…. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు

…. ఆగస్ట్ 15 లోగా నూటికి నూరు శాతం రుణ మాఫీ అయ్యి తీరుతుంది

….నీలం మధుకు బీ అర్ ఎస్ పై 50వేల మెజారిటీ ఇవ్వండి

…. దుబ్బాక అభివృద్ధి కోసం శ్రీనివాస్ రెడ్డి కి అండగా ఉంటా

…. జగ్గారెడ్డి మాట ఇస్తున్నాడు

దుబ్బాక రోడ్ షో లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో కి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హబ్సిపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్ షో దుబ్బాక పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడారు.

జగ్గారెడ్డి కామెంట్స్ :

దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, వ్యాపారులారా.. మీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను.

గతంలో ఏం అభివృద్ధి జరిగింది… రేపు ఏమి అభివృద్ధి జరగాలో చర్చిద్దాం.

వ్యాపారులూ మీరు ఆలోచన చేయండి. చర్చ చేయండి.

20 ఏళ్ల కిందట అందరూ సంగారెడ్డిలో జడ్పీకి వచ్చేటోళ్లు. ఆ రోజుల్లో కేసీఆర్ కి, ముత్యంరెడ్డికి కొట్లాట నడుస్తుండేది. నిధులన్నీ దుబ్బాకకే తీసుకుపోతున్నడని అనేవాళ్ళు.

రాష్టంలో వున్న నిధులన్నీ దుబ్బాక పోతున్నాయని చర్చ జరిగేది. ఒక సందర్బంగా చంద్రబాబు కూడా ముత్యంరెడ్డితో అన్నారు. నిధులు అన్నీ దుబ్బాక కి తీసుకపోతున్నావని అన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా రోడ్లు లేకున్నా, స్కూళ్లు లేకున్నా… దుబ్బాకలో ముత్యంరెడ్డి మంచి రోడ్లు వేయించారు. స్కూళ్లు కట్టించారు. అలాంటి ముత్యంరెడ్డి కొడుకుని ఓడగొట్టుకుంటారా?

సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు… రుణమాఫీ 2లక్షలు ఒకే సారి మాఫీ చేస్తామన్నరు. దైవసాక్షిగా మాట ఇచ్చారు. గతంలో రెండుసార్లు కేసీఆర్ రుణమాఫీ పేరిట మోసం చేశారు.

మొన్ననే రుణమాఫీ అయిపోవు. కేసీఆర్ వున్న పైసలు అన్నీ నాకి పారేసిండు. ప్రభుత్వం వద్ద పైసలు లేవు. కేసీఆర్ అడుగు కూడా మిగల్చకుండా గీకి, నాకి, దివాళా తీయించి దిగిపోయిండు.

కేసీఆర్ ఈ రోజు హ్యాపీ గా ఉన్నారు. అప్పులు చేసిన.. అక్కడ ఏమీ లేదు… కాంగ్రెస్ వాళ్లు కొట్టుకుంటారు అని అనుకుంటున్నారు. డబ్బులు లేకనే రుణ మాఫీ మూడు నెలలు ఆలస్యం అయ్యింది.

సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాటనిలబెట్టుకుంటారు. నేను కూడా మాట ఇస్తున్నా. August 15లోగా రుణమాఫీ అవుతుంది.

కొత్త ప్రభాకర్ రెడ్డి పదేళ్లు ఎంపీ వున్నా… బీడీ కార్మికులను ఆదుకోలే… ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేసిర్రు. ఇట్లా అయితే ఎట్ల మీ బతుకులు బాగు పడతాయి. అయిదేళ్ల దాకా ఎవరు మిమల్ని పట్టించుకుంటారు.

జగ్గారెడ్డిగా మాటిస్తున్న. రాహుల్ గాంధీ ప్రధాని అయితారు. సీఎంతో రేవంత్ తోనూ మాట్లాడతా.. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా నేను ప్రయత్నం చేస్తాను.

ఈ అయిదేళ్లు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినా.. ఏ పని అయినా శ్రీనివాస్ రెడ్డి చేయాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయలేడు.

దుబ్బాక నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి. మేం జవాబుదారీగా ఉంటాం. జగ్గారెడ్డి మాట ఇస్తే తప్పక పని అయితది.

కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేడు. హరీశ్ రావుతో కాదు.. కొత్త ప్రభాకర్ రెడ్డితో కాదు..ఏ పని అయినా సీఎంరేవంత్ రెడ్డితో అవుతది. నేను శ్రీనివాస్ రెడ్డిని సీఎం దగ్గరకు తీసుకపోయి కూర్చొబెట్టి పనులు చేయిస్తా. జగ్గారెడ్డిగా… నేను బరాబర్ మాట ఇస్తున్నా.

మీరు 50వేల మెజారిటీ ఇస్తే.. శ్రీనివాస్ రెడ్డి పనులు కావాలని సీఎంని అడగగలరు. నేను ఆయన పక్కన వుంటాను.