అన్ని వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వండి… APSRTC వైస్ చైర్మన్,,

భారత్ న్యూస్ గుడివాడ……

అన్ని వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వండి… APSRTC వైస్ చైర్మన్ మిద్దెల హరి గారు

ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ” బియ్యపు మధుసూదన్ రెడ్డి ” గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణం 6,7,వ వార్డ్ ల యందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన APSRTC వైస్ చైర్మన్ మిద్దెల హరి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 2024 మేనిఫెస్టో లో గల పథకాలును ప్రజలకు వివరిస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వండి అని ప్రజలను అభ్యర్థించారు. అదేవిధంగాEVM నమూనా చూపిస్తూ MLA అభ్యర్థి అయినా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి వరుస సంఖ్య 3వ నెంబర్ ఫ్యాన్ గుర్తు పై ఓటు నొక్కాలని, MP అభ్యర్థి అయినా Dr గురుమూర్తి గారికి కూడా వరుస సంఖ్య 1 వ నెంబర్ ఫ్యాన్ గుర్తు పై నొక్కాలని కోరడమైనది.ఈనెల 13వ తేదీ జరిగే ఎలక్షన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి బాలకృష్ణయ్య, గున్నేరు మధుసూదన్ రెడ్డి, గంజి వెంకటేష్, పార్ధ, పసల కుమార్ స్వామి, ఇసుకమట్ల బాల, వార్డు ఇన్చార్జిలు బొజ్జ ప్రభాకర్, కళ్యాణి, కార్యకర్తలు శేఖర్, నెల్లూరు రాఘవులు, జనార్ధన్, లక్ష్మయ్య, నాగార్జున, వాసు, ముని చంద్ర పాల్గొనడం జరిగింది