చింతగుంట నుంచి టీడీపీలోకి వలసలు,,,,

భారత్ న్యూస్ గుడివాడ……

చింతగుంట నుంచి టీడీపీలోకి వలసలు

యర్రావారిపాలెం మండలం, చింతగుంట పంచాయతీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. బుధవారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చింతగుంటకు షాహిద్, సద్దాం, కరిముల్లా, ముని శేఖర్, ధర్మయ్య, శివ, నాగార్జున, వెంకట సిద్దులు, సుబ్రమణ్యం తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివర్తి నాని పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అరాచక శక్తులతో పోరాటం చేస్తున్నామని అందరూ కలిసి కట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యమని పులివర్తి నాని అన్నారు. పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.