కరట్లపల్లి సచివాలయంలో దొంగలు పడ్డారు..

కరట్లపల్లి సచివాలయంలో దొంగలు పడ్డారు..

కూడేరు ఏప్రిల్ 24( భారత్ న్యూస్ )
కూడేరు మండలంలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీ సచివాలయం కరుట్లపల్లి గ్రామంలో ఉన్న సచివాలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులుసచివాలయం యొక్క తాళాలను పగలకొట్టి లోపలికి చొరపడి బీరువాలు తెరవడానికి విఫల ప్రయత్నం చేశారు. లోపల విధ్యుత్ వైర్లు తెంపి, పేపర్లను చిందర వందర చేసి నానా భీభత్సం సృష్టించి లోపల కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్ళలేదు.బుధవారం ఉదయం ఉద్యోగులు సచివాలయానికి రాగానే జరిగిన సంఘటనను చూసి అవాక్కయ్యారు. మహిళా పోలీసు అయిన దేవి వెంటనే కూడేరు పోలీస్ స్టేషన్ యందు సీఐ శివరాముడికి విషయాన్ని తెలియచేసి స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది.గ్రామ ప్రజలు జరిగిన సంఘటనను చూసి ఇది ఆకతాయిల పనైనా ఉండొచ్చు, తాగుబోతుల పనైనా ఉండొచ్చని, గ్రామంలో సాయంత్రం పూట కూడేరు నుంచి మద్యం తెచ్చుకుని బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అలాంటి వారి చేష్టలకు మహిళలు కూడా బయపడుతున్నారని పోలీసుల ద్వారా గ్రామంలో నిఘా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఫోటో రైట్ అప్.. సచివాలయంలో పేపర్లు చంద్రబంద్ర చేసిన దొంగలు..