టిడిపి పార్టీలో చేరిన పలువురు నేతలను సన్మానించిన పాకాల మండల టిడిపి నాయకులు

టిడిపి పార్టీలో చేరిన పలువురు నేతలను సన్మానించిన పాకాల మండల టిడిపి నాయకులు

పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక దినసరి మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయంలో మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్,గాదంకి మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి,డి.ఎస్.ఎస్ అధ్యక్షుడు జింకలమిట్ట చంద్రశేఖర్ లను పాకాల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం పూలమాల వేసి శ్యాలువ కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో తమ వంతు పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.