కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు,,

భారత్ న్యూస్ ఘంటసాల

కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు

ఘంటసాల మండలంలో ఉత్సాహంగా సాగుతున్న మండలి బుద్ధప్రసాద్ రోడ్ షో

అడగడుగునా మండలి బుద్ధ ప్రసాద్ కు నీరాజనాలు పలికిన ప్రజలు
అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థి డా.మండలి బుద్ధప్రసాద్ నిర్వహించిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డలో రోడ్ షో ముగించుకుని ఘంటసాల మండలంలో అడుగుపెట్టిన మండలికి చిట్టూర్పు వద్ద టిడిపి..జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ ర్యాలీ వెంట రాగా చిట్టూర్పు, దళితవాడ అక్కడినుండి వేములపల్లి, చినకళ్ళేపల్లి, గోగినేనిపాలెం,పాపవినాశనం మీదుగా రోడ్ షో ముందుకు సాగుతోంది. తెలుగు తమ్ముళ్లు జనసైనికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద పెద్ద జెండాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో హుషారుగా పాల్గొన్నారు. గ్రామాల్లో అడగడుగునా బుద్ధ ప్రసాద్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. పూలమాలలు.. బొకేలు ఇవ్వటంతో పాటు పూలవర్షం కురిపించారు.