పాకాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చెవిరెడ్డి లక్ష్మీ,,

పాకాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చెవిరెడ్డి లక్ష్మీ

పాకాల ( భారత్ న్యూస్ )పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చెవిరెడ్డి లక్ష్మీ తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో మమేకమై చెవిరెడ్డి లక్ష్మీ పార్టీ కరపత్రాలు పంచుతూ.. మోహిత్ రెడ్డిని మీ బిడ్డగా భావించి రానున్న ఎన్నికల్లో ఈవీఎంలో నెంబర్-1.. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా చెవిరెడ్డి కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అందరికీ అందుబాటులో ఉంటాడు.. మీ బిడ్డగా పిలిస్తే పలుకుతాడుమీకు మంచి చేసినది దృష్టిలో పెట్టుకొని మోహిత్ రెడ్డిని గెలిపించాలని చెవిరెడ్డి లక్ష్మీ విజ్ఞప్తి చేశారు.