Headlines

కన్నుల పండువగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట,కుంబాభిషేకం..ప్రత్యేక పూజలో పాల్గొన్నపులివర్తి వినీల్,,,

కన్నుల పండువగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట,కుంబాభిషేకం..ప్రత్యేక పూజలో పాల్గొన్న పులివర్తి వినీల్

పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట,మహా కుంబాభిషేకం మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా శనివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆ తర్వాత అంకురార్పణం,వాస్తు హోమం,పర్యజ్ఞీకరణ,శిఖరానికి క్షీరాధివాసం,జలాధివాసం,ధాన్యాధివాసం,నవరత్న,ధాతున్యాసాలు చేపట్టారు.శిఖరస్థాపనలో భాగంగా మూర్తిహోమం,మూలమంత్ర హోమాలు,కళాహోమాలు,శాంతి హోమాలు నిర్వహించారు.మహా పూర్ణాహుతి,కుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.పూజ కార్యక్రమాలు అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు‌.దర్శనానంతరం పులివర్తి వినీల్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.