సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు ౼ జిల్లా ఎస్పీ శ్రీ,,,వి.ఎన్. మణికంఠ చందోలు,IPS.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు ౼ జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు,IPS.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ అధికారులు

చిత్తూరు (భారత్ న్యూస్ ) ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమే కాకుండా, మద్యం, నగదు, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి అవకాశం వున్న ఇతర వస్తువులు అక్రమ రవాణాను అరికట్టడానికి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా తగిన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ, సమస్యాత్మక గ్రామాలలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు.

మద్యం, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి వాహన తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని, దీనికోసం సాయుధ బలగాలను కూడా వినియోగిస్తున్నామన్నారు. జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, ఎన్నికలు నియమావళి అతిక్రమించిన, ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.