భారత్ న్యూస్ కోడూరు
*గుడ్ ఫ్రైడే సందర్భంగా కృష్ణాపురంలో నిర్వహించిన సిలువ యాత్ర ప్రార్థనల్లో పాల్గొన్న:- ఎమ్మెల్యే సింహాద్రి
ఈరోజు కోడూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చి నందు నిర్వహించిన సిలువ యాత్ర ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, మాట్లాడుతూ మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు, అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.