తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో

భారత్ న్యూస్ విజయవాడ…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్చార్జి, పి. వి. ఫణి కుమారు, డివిజన్ అధ్యక్షుడు, గంజాల రవికుమార్ ల ఆధ్వర్యంలో సిడింబి అగ్రహారం లోని తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ వద్ద స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి, స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గొర్రెపాటి గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యి మీడియాతో మాట్లాడుతూ…

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటిన ఘనత తెలుగుదేశం పార్టీ దని, పేదవాడికి కూడు, గూడు, ఏర్పాటు చెయ్యాలి అనే సంకల్పంతో ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతిని ఇనుముడింప చేశారు అన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని మరింత ముందరకి తీసుకు వెళ్తున్నారు అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన తో పుట్టిన పార్టీ తెలుగుదేశం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 45 డివిజన్ నాయకులు, వేమూరి రామకృష్ణారావు, వేల్చూరి అనిల్ కుమార్, మాదివాడ వెంకట నరసింహారావు, బత్తిన అగస్టేశ్వర రావు, కోమటి వెంకటేశ్వరరావు, విన్నకోట శేఖర్, గౌర నాగేంద్రం, విన్నకోట రమేష్, విన్నకోట మాధవ, పోసిన ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.