ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వసంత శీరిష గారి ఎన్నికల ప్రచారం

భారత్ న్యూస్ విజయవాడ…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వసంత శీరిష గారి ఎన్నికల ప్రచారం

మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు

శుక్రవారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు గారికి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ గారికి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు

ఎన్నికల ప్రచారం లో భాగంగా రింగ్ సెంటర్ లోని చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లోకి రాగానే అందరికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు

బాబు గారి సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారు

ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు మహిళా నేతలు తెలుగుదేశం, జనసేన బిజెపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు