వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన సాధ్యం.

భారత్ న్యూస్ అవనిగడ్డ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన సాధ్యం..

అవనిగడ్డ 9వ వార్డ్, కొత్త ఎడ్లంక నేరెళ్లపాలెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుటుంబ సభ్యులు మరియు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు…

ఈరోజు అవనిగడ్డ మండలం, అవనిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని 9వ వార్డ్, కొత్త ఎడ్లంక నేరెళ్లపాలెం, నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, సతీమణి కెప్టెన్ లక్ష్మీ గారు, రమేష్ బాబు గారి మేనల్లుళ్లు డాక్టర్ గంగాధర్ రాయుడు గారు, రాజు గారు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు,మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని,అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు…

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, 5వ సెగ్మెంట్ ఎంపీటీసీ అవనిగడ్డ స్వర్ణకుమారి, కో-ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ భాష, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, వడ్లమూడి వెంకట్రావు, రేపల్లె రాజా, ఆలపర్తి ముసలయ్య తోట ప్రసాద్, తుంగల అంకరావు, మెడికొండ సంతోషరావు, వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు…