ఎమ్మెల్యే పై విశ్వాసం కోల్పొతున్న వైసీపీ నేతలు,,,పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరికలు,,

ఎమ్మెల్యే పై విశ్వాసం కోల్పొతున్న వైసీపీ నేతలు

పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరికలు

చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజల్లోనే కాకుండా క్యాడర్ లో కూడా విశ్వాసం కోల్పొతున్నారు. ఆయన కుటుంబ పాలన, ఎదుగుదల ఓర్వలేని తనంతో ఒక్కోక్కరుగా పార్టీని వీడుతున్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం, రణధీరపురం పంచాయతీ బి టి ఆర్ కాలనీకి చెందిన సుశీల, కన్నమ్మ, రూప, మాధవి, కవిత, రోజా, అమ్ములమ్మ, సరస్వతి, సుభాషిని, చిత్ర, నందిని, దుర్గ, జ్ఞానంబ, గాయత్రి, తిరుమల నగర్ పంచాయతీకి చెందిన కిషోర్, వెంకీ, వసంత, ముని, గంగాధర్, సప్తగిరి కాలనీ పంచాయతీకి చెందిన నాగరాజు, వెంకటేష్, బాబు, నాగార్జున,రమేష్ తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పులివర్తి నానితోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.