గిరిజన దంపతులపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయండి.

భారత్ న్యూస్:
గిరిజన దంపతులపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయండి..

విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న డిమాండ్..

కూడేరు ఏప్రిల్ 13 (భారత్ న్యూస్)
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కళాకారుల కాలనీకి చెందిన గిరిజన దంపతులపై అగ్రకులాలకు సంబంధించిన వారు విచక్షణ రహితంగ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని విహెచ్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న డిమాండ్ చేశారు
ఈసందర్భంగ వీహెచ్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న విలేకరులతో మాట్లాడుతూ గిరిజన దంపతులపై దాడి జరిగిందని దంపతులిద్దరూ రాప్తాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని అయితే కేసు తూతూ మంత్రంగ నమోదు చేసి నీరు గారి పోయే విధంగ చేయడం వలన నిందితులు మరింత రెచ్చిపోయే దానికి అవకాశం ఉందని అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని తక్షణమే దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని గిరిజన దంపతులకు పోలీసులు అండగ ఉండి భరోసా ఇవ్వాలని గిరిజన దంపతులకు నిందితుల వల్ల ప్రాణహాని ఉందని తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అత్యాయత్నం దాడి వంటి పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి కఠినంగ శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు చేపట్టాలని అలా జరగని పక్షంలో రాప్తాడు పోలీస్ స్టేషన్ ముందు బాధితులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న తెలిపారు
ఈసమావేశంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్నతో పాటు వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు చోళ సముద్రము శ్రీరాములు, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పాల ఈశ్వరయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు