అగ్నిమాపక వారోత్సవాలు

అగ్నిమాపక వారోత్సవాలు

పాకాల( భారత్ న్యూస్ ) పాకాల అగ్నిమాపక కేంద్ర అధికారి గుణశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలుఏప్రిల్ 14 నుండి 20 వరకు జరుగునని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం లో1944 వ ఏప్రిల్ 14సంవత్సరాం బొంబాయి షిప్ యార్డ్ జరిగిన అగ్ని ప్రమాదం లో మరణించిన సిబ్బందికి నివాళలు అర్పించి మౌనం పాటించారు.అగ్ని ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.అంబేద్కర్ జయంతి సందర్భంగా అగ్నిమాపక కేంద్రం యందు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి స్వీట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది విశ్వనాధం, రామకృష్ణ, భాస్కర్,మనోహర్ రెడ్డి, నాగార్జున,రాజేంద్ర బాబు,నరేంద్ర, సురేంద్రబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.