కూడేరులో ఘనంగాడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

భారత్ న్యూస్:
కూడేరులో ఘనంగాడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

మహనీయుడికి ఘన నివాళులు, దళిత సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు..

కూడేరు ఏప్రిల్ 14( బారత్ న్యూస్ ) స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు, మొదటిగా ఎమ్మార్పీఎస్ నాయకులు విహెచ్పిఎస్ పెద్దన్న, ఎం ఆర్ పి ఎస్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మన్న, అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి ఘన నివాళులర్పించారు, అలాగే వైయస్సార్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ దేవరాజు, మాజీ ఎంపీటీసీ సంగప్ప,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామదుర్గం కిష్టప్ప,మండల జనరల్ సెక్రెటరీ తోపుదుర్తి రామాంజనేయులు, కో ఆప్షన్ నెంబర్ సర్దార్ వలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడేరు గ్రామపంచాయతీ సర్పంచ్ మీనుగ లలితమ్మ, ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ 133 జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1891 ఏప్రిల్ 14వ తేదీన రాంజీ సక్ఫల్, బీమా బాయి దంపతులకు మధ్యప్రదేశ్లోని మౌ అనే చిన్న గ్రామంలో జన్మించారు. వీరు మహర్ అనే అస్పృశ్య కులానికి చెందినవారు. ఆ రోజుల్లో దళితులకు గుడి, బడి నిషేధం. అంబేద్కర్ బాల్యంలోనే అనేక అవమానాలకు గురయ్యారు. తోటి విద్యార్థులతో కాకుండా బడి బయట కూర్చుని చదువుకున్నారు. అనేక అవమానాలను భరిస్తూ దేశ, విదేశాల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగం సంపాదించారన్నారు ఉద్యోగపరంగా ఉన్నత పదవి అయినప్పటికీ దళితుడనే ఉద్దేశంతో బంట్రోతు కూడా గౌరవించని పరిస్థితని తన ఉద్యోగానికి రాజీనామా చేసి దళితుల కోసం, దళిత హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి అణగారిన అట్టడుగు వర్గాలకు గొంతుకయ్యాడని అవమానాలు భరించడం తప్ప ఎదిరించని జాతికి నాయకుడయ్యాడన్నారు నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు చేయాలని పోరాటాలు చేశారని స్వతంత్ర భారత వనిలో తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తధా అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారతదేశ కాలమాన పరిస్థితులను పరిగణలో తీసుకుని ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను నిర్మించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాకుండా సమాజంలో అణిచివేతకు గురైన అనేక అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం, మహిళల హక్కుల కోసం పోరాటాలు చేసి రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు మరణం ఎవరిని విడవదని మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత సూర్యుడు 1956 డిసెంబర్ 4 తారీఖున అస్తమించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆశయాలను ప్రతి యువతీ యువకులు ముందుకు తీసుకెళ్లాలని కుల,మత, వర్గ రహిత సమాజాన్ని ఆయన ఆశించారన్నారు ఆయన ఆశయ సాధన కోసం నేను సైతం అంటూ ముందుకు నడవాలన్నారు..