.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో గల పులిగిల్ల ఫంక్షన్ హాల్లో,,

భారత్ న్యూస్ హైదరాబాద్..సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో గల పులిగిల్ల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు బొల్లారం మున్సిపల్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. రాబోయే 13 రోజుల పాటు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలులో చేస్తున్న నిర్లక్ష్య ధోరణినీ ప్రజలకు వివరించాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ వినిపించాలంటే బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలపాలని కోరారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఎగుర వేసి శుభాకాంక్షలు తెలిపారు. హాజరైన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.