,భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును,,,

భారత్ న్యూస్ హైదరాబాద్,,,భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును పరమపూజ్యులు, ప్రపంచ శాంతి దూత దలైలామా గారికి అందజేయడం జరిగింది. ధర్మశాలలోని దలైలామా గారి నివాసంలో బుధవారం ఉదయం వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈఅవార్డును అందజేశారు. పివి ఫౌండేషన్ అధ్యక్షులు, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఛైర్మన్ మణీందర్ జీత్ సింగ్ బిట్టా, పివి మనుమడు పి వి ఆర్ కశ్యప్, హైదరాబాద్ కు చెందిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్, సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, పి వి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అనిల్ కుమార్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత పి వి స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. శాంతి ద్వారానే ప్రపంచం మనుగడ సాగించగలదని దలైలామా అన్నారు. భారతరత్న పి వి ప్రపంచశాంతి కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. పి వి అడుగుజాడలలో నడవాల్సిన అవసరం వుందని బిట్టా, బాలలత మల్లవరపు ఈసందర్భంగా అన్నారు. పి వి మెమోరియల్ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమంకు, రతన్ టాటాకు ఇవ్వడం జరిగిందని, మూడవసారిగా దలైలామాకు ఇచ్చామని పివిఆర్ కశ్యప్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు.