సీనియర్ రాజకీయ నాయకులు, పోటుమీద మాజీ సర్పంచ్ కడవకొల్లు నాగేశ్వరరావు ని మాజీ ఉపసభాపతి,,

భారత్ న్యూస్ కోడూరు

సీనియర్ రాజకీయ నాయకులు, పోటుమీద మాజీ సర్పంచ్ కడవకొల్లు నాగేశ్వరరావు ని మాజీ ఉపసభాపతి, ఎన్డీయే కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కోడూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుద్ధప్రసాద్ పోటుమీద గ్రామానికి వెళ్లగా, ఆయన వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న నాగేశ్వరరావు ఆరుబయట బుద్ధప్రసాద్ రాకకై కూర్చున్న సంగతి తెలుసుకున్న బుద్ధప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు రాజకీయాల గురించి చర్చించుకున్నారు. మీకేం పర్లేదు..గెలిచేది మీరే అంటూ నాగేశ్వరరావు చెప్పగా బుద్ధప్రసాద్ ధన్యవాదములు తెలిపారు. అనంతరం తమ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును బుద్ధప్రసాద్ నాగేశ్వరరావు కి అందించారు.