Headlines

Digital payments for purchase of tickets at railway stationsPromoted South Central Railway

.Bharathnews.hyd,,,

రైల్వే స్టేషన్లలో టిక్కెట్ల కొనుగోలుకై డిజిటల్ చెల్లింపులను
ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

  • టిక్కెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పి.ఓ.ఎస్ మెషీన్లు మరియు యూ.పి.ఐ ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది .
    దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. ఈ దిశలో భాగంగా యూ.టి.ఎస్.మొబైల్ యాప్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లు ( పి.ఓ.ఎస్), యూ.పి.ఐ చెల్లింపులు మొదలైన వాటిని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలు చేపట్టబడ్డాయి. ఆన్‌లైన్ సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు రైలు వినియోగదారులు సులభంగా మరియు సౌకర్యవంతంగా టిక్కెట్లు కొనుగోలు చేయడానికి, నగదు రహిత లావాదేవీలు మరియు డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం దాదాపు జోన్లోని అన్ని ముఖ్యమైన నాన్-సబర్బన్ స్టేషన్లు (ఎన్.ఎస్.జి.)1-4 మరియు సబ్-అర్బన్ కేటగిరీ స్టేషన్‌లలోని అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పి.ఆర్.ఎస్.) మరియు అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యూ.టి.ఎస్.) కౌంటర్లలో పి.ఓ.ఎస్ మెషీన్లు మరియు యూ.పి.ఐ చెల్లింపులను ఏర్పాటు చేసింది.
    సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, నగదు రహిత చెల్లింపులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీని ప్రకారం, ఆధునిక యుగం రైలు ప్రయాణీకులకు అనుగుణంగా సేవ చేయడానికి మరియు అన్నిశ్రేణుల రైలు వినియోగదారులలో ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, రైల్వే కౌంటర్ టికెటింగ్‌లో డిజిటల్ చెల్లింపుల వాటాను మరింత పెంచడానికి దక్షిణ మధ్య రైల్వే సానుకూల ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం, పి.ఆర్.ఎస్. మరియు యూ.టి.ఎస్. టికెటింగ్ కోసం 466 పి.ఓ.ఎస్ యంత్రాలు అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ పి.ఓ.ఎస్ మెషీన్‌లు డెబిట్/క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తాయి, తద్వారా సులభతరమైన మరియు సౌకర్యవంతమైన లావాదేవీలను అందజేస్తాయి. యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే వివిధ యూ.పి.ఐ యాప్‌ల ద్వారా కూడా ప్రయాణీకులు చెల్లింపులు చేసుకొనే వీలుకల్పించబడింది. యూ.పి.ఐ యాప్‌లు మొబైల్ ఫోన్‌ల ద్వారా సౌకర్యవంతమైన మరియు వేగవంతమైన చెల్లింపులను నిర్ధారిస్తాయి.

జోన్ అంతటా డిజిటల్ చెల్లింపు వ్యవస్థల వినియోగాన్ని మరింత మెరుగుపరచడానికి దక్షిణ మధ్య రైల్వే కార్యక్రమాలు చేపట్టింది. ఈ దిశలో భాగంగా, జోన్‌లో పి.ఓ.ఎస్ , యూ.పి.ఐ మొదలైన డిజిటల్ చెల్లింపులను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు ఉన్న ఇదివరకు ఈ సౌకర్యం లేని నాన్-సబర్బన్ మరియు సబర్బన్ కేటగిరీ రైల్వే స్టేషన్లలో యంత్రాల అవసరాలను గుర్తించడం మరియు సమీక్షించడం జరుగుతుంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, రైల్వేలో డిజిటల్ ఇండియా చొరవను బలోపేతం చేయడానికి మరియు రైలు వినియోగదారులందరికీ సులభమైన మరియు వేగవంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి సానుకూలంగా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. టికెట్ కొనుగోలులో నగదు రహిత లావాదేవీలను అనుసరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. తత్ఫలితముగా రైలు వినియోగదార్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వారికి సులభమైన మరియు సౌకర్యవంతమైన కొనుగోలు అవకాశాన్ని అందజేస్తుందని తెలియజేశారు.