ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన

భారత్ న్యూస్ హైదరాబాద్…

ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపర్ణ గార్గ్, ఐ.ఆర్.ఏ.ఎస్.

సివిల్ సర్వీసెస్ 1987 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్ అధికారిణి శ్రీమతి అపర్ణ గార్గ్ ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఐ.ఆర్.ఎఫ్.ఎమ్) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ బాధ్యతలు స్వీకరించడానికి పూర్వం , శ్రీమతి. అపర్ణ గార్గ్ బెంగళూరు లోని రైల్ వీల్ ఫ్యాక్టరీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, మైసూర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా మరియు దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వేలలో 35 సంవత్సరాల పాటు రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేశారు.
వారు చెవెనింగ్ ఫెలో మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ నుండి ట్రాన్స్‌పోర్ట్ ఎకనామిక్స్‌లో అడ్వాన్స్‌డ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశారు. దీనితోపాటు ఆమె మిలన్లోని బోకోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సింగపూర్లోని ఐ.ఎన్.ఎస్.ఇ.ఏ.డి మరియు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కూడా శిక్షణ పొందారు.