కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం,,,

భారత్ న్యూస్:
కూడేరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం

అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి.

కూడేరు మే 6 (భారత్ న్యూస్)
ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు, ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు ఎక్కువ సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, మొదటిగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల హారాలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు, ఇంటింటా ప్రచారం చేస్తూ ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పార్టీ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి ఇంటర్ ప్రచారం చేపట్టారు, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ప్రచారం చేపట్టారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్నారాయణస్వామి యాదవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరంపేట ఆంజనేయులు, సిపిఐ నాయకులు తాలూకా కార్యదర్శి జై మల్లికార్జున, కూడేరు మండల కార్యదర్శి నారాయణమ్మ, జిల్లా నాయకులు రమణ, పార్వతీ ప్రసాద్, అరవకూరు రాయుడు, సిపిఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్, బాల రంగయ్య, రంగారెడ్డి, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు..