ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్…

ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారి అధ్యక్షత వహించారు. మహిళా మోర్చా పదాధికారులు మరియు పార్లమెంటరీ మహిళ కన్వీనర్లు కోకన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంఘటన మంత్రి) శ్రీ చంద్రశేఖర్ తివారి జి గారు, మహిళా మోర్చా ప్రబారి చింతల రామచంద్ర రెడ్డి గారు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ పద్మ వీరపనేని గారు, విచ్చేశారు.

చంద్రశేఖర్ జి గారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో మహిళా మోర్చా పదాధికారులు నిర్వహించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తూ దిశా – నిర్దేశం చేశారు. 17 లోకసభ పార్లమెంటు స్థానాల్లో మహిళా శక్తి సమ్మేళనాలను నిర్వహించవలసిందిగా సూచించారు.అలాగే ప్రతి మండల, డివిజన్స్ స్థాయిలో మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆశ వర్కర్స్ మరియు అంగన్వాడీ టీచర్లతో మహిళా సమ్మేళనాలు నిర్వహించి వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని తెలియజేశారు.కొత్తగా ఓటు హక్కు కలిగిన మహిళా ఓటర్లను ప్రత్యేకంగా కలిసి మోదీ గారి పథకాలను తెలియజేసి వారిని బిజెపి పై విశ్వాసం కల్పించవలసినదిగా సూచించారు. 🙏🏻