పాకాల అంబేద్కర్ భవనం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 197వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులుఅర్పించిన తెలుగు తమ్ముళ్లు
పాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం పాకాల అంబేద్కర్ భవనం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 197వ వర్ధంతి సందర్భంగా గురువారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేశారని, జ్యోతిరావు పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు పాకాల తెలుగుదేశ కార్యకర్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు