తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని “అగ్నిపర్వతం” బద్దలయ్యే,,,

భారత్ న్యూస్ గుడివాడ……

“తిరుపతి ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం”
నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని “అగ్నిపర్వతం” బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబోవు ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్ నిమ్మకాయల వీధి తీర్థకట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు!

ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు,ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అభద్రతాభావంతో జీవిస్తున్నారని ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి భూ కబ్జాదారులకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు!

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజ్యమేలుతున్నదని “ల్యాండ్” “సాండ్” “శాండిల్” “లిక్కర్” మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు!

తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలతో దర్జాగా ప్రజాధనాన్ని కొల్లగోడుతూ యువతరాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేశారన్నారు!

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్ను విధించే పాత పద్ధతిని తీసుకొస్తామన్నారు!