సప్తగిరికి కాలనీలో వైసీపీకి షాక్.టీడీపీలో చేరిన బిసి నాయకులు విశ్వనాథం,

భారత్ న్యూస్ గుడివాడ…

సప్తగిరికి కాలనీలో వైసీపీకి షాక్

టీడీపీలో చేరిన బిసి నాయకులు విశ్వనాథం

తిరుపతి రూరల్ మండలం, సప్తగిరి కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథంతో పాటు పార్వతి, మాజీ వార్డ్ మెంబర్ రమాదేవి తదితరులు తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివర్తి నాని వారిని సాదరంగా ఆహ్వానించి పసుపు కండువాలు కప్పారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసిలకు అన్యాయం చేసిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.