భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలనేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం ఇన్చార్జి బోయ శ్రీరాములు, బోడా అంజయ్య, కొక్కుల దశరథ్, నరసింహ, సురేందర్,కృష్ణ, విజయ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు……