తిరుపతి రూరల్ నుంచి పోటెత్తుతున్న వలసలు,,,

భారత్ న్యూస్ గుడివాడ..

తిరుపతి రూరల్ నుంచి పోటెత్తుతున్న వలసలు

ఓటేరు వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోటెత్తుతున్నాయి‌. ఉదయం, మధ్యాహ్నం రెండు పంచాయితీల నుంచి వైసీపీ నేతలు భారీ స్థాయిలో టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా ఓటేరు పంచాయతీకి చెందిన వైసీపీ నేతలు రమేష్, మోహన్, అజయ్, మనీ, గుర్రప్ప, సాయి, లోకేష్, బాల, అజయ్ చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రౌడీయిజం, గంజాయి, కబ్జాలు, దాడులు ఆక్రమణలు తప్ప వైసీపీ పాలనలో మంచికి చోటు లేదని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం కావాలన్నా… అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా తెలుగుదేశం పార్టీతో సాధ్యమని చెప్పారు. ఓటమి చెందినా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పులివర్తి నాని తోనే భవిష్యత్తు కు గ్యారెంటీ ఉంటుందని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.