నాగాయలంక మండలం ఎదురుమొండి పర్యటనకు వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ, ఎమ్మెల్యే,,,

భారత్ న్యూస్ నాగాయలంక

నాగాయలంక మండలం ఎదురుమొండి పర్యటనకు వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ వల్లభనేని బాలశౌరి, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గార్లకు ఎదురుమొండి గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీస్సులు అందచేశారు. గ్రామస్థులు పూలవర్షం కురిపించారు. గ్రామంలో దేవాలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. బాలశౌరి, బుద్ధప్రసాద్ గార్లకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి తమ ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
.