కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ 9 వ వార్డు మెంబర్ సిద్దినేని సంపూర్ణమ్మ వైసీపీ ని..

భారత్ న్యూస్ అవనిగడ్డ

జనసేన లోకి వైసీపీ వార్డు మెంబర్..

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ 9 వ వార్డు మెంబర్ సిద్దినేని సంపూర్ణమ్మ వైసీపీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. సోమవారం ఉదయం బుద్ధప్రసాద్ నివాసానికి వచ్చిన సంపూర్ణమ్మ తమ గ్రామ అభివృద్ధిపై పలు విషయాలను బుద్ధప్రసాద్ తో చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ లకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నగదు జగన్ దొడ్డిదారిన లాక్కోవడం వలన పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, కనీస అవసరాలైన శానిటేషన్, వీధి లైట్లు కూడా వేయలేని దుస్థితిలో పంచాయతీలు ఏర్పడ్డాయని అన్నారు. గతంలో బుద్ధప్రసాద్ హయాంలోనే ఉల్లిపాలెం గ్రామం అభివృద్ధి చెందిందని, మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మరలా బుద్ధప్రసాద్ హయాంలోనే జరుగుతుందని నమ్మి, బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బుద్ధప్రసాద్ ఆమెకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సంపూర్ణమ్మతో పాటుగా ఆమె భర్త సిద్దినేని వెంకటేశ్వరరావు, మాజీ బ్యాంకు ప్రెసిడెంట్ కొక్కిలిగడ్డ శివన్నారాయణ సోదరుడు కొక్కిలిగడ్డ రఘురామయ్య కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బడే రాఘవరావు, దాసరి సాంబశివరావు లు పాల్గొన్నారు.