జగన్ హుద్ హుద్ తుఫాను కంటే భయంకరమైన వాడు – దగ్గుబాటి పురందరేశ్వరి –

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,విజయవాడ:- జగన్ హుద్ హుద్ తుఫాను కంటే భయంకరమైన వాడు – దగ్గుబాటి పురందరేశ్వరి – ఎన్ డి ఏ మహాకూటమి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి డాll నందమూరి తారక రామారావు ప్రథమ సంతానం మాజీ కేంద్ర క్యాబినెట్ మంత్రి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరికి అఖండ ప్రజాదరణ లభించింది వారాహి ప్రచార రథము పై నుండి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రసంగించారు ఈ సందర్భంగా దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ జగన్ హుద్ హద్ తుఫాన్ కంటే భయంకరమైన వాడిని రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా తనను అఖండ భారీ మెజార్టీతో గెలిపిస్తే బిజెపి మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలమని పందుల దిబ్బగా ఉన్న రాజమండ్రిని నందనవనంలా తీర్చిదిద్దుతానని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పురందరేశ్వరి చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు