ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే :జొన్నలగడ్డ

భారత్ న్యూస్ హైదరాబాద్….

ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే :జొన్నలగడ్డ

సమాజంలో దాగివున్న మూఢ నమ్మకాలు, అసమానతలను పారద్రోలిన ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జీబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం సత్తెనపల్లి బార్ అసోసియేషన్ హాలు లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులం గోడలను ఛిద్రం చేసి బడుగు, బలహీన, బహుజన వర్గాల అభ్యున్నతి, సమానత్వ సాధనకై తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. అనంతరం ఆయన పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.