Headlines

మరోసారి జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం,,,,

భారత్ న్యూస్:
మరోసారి జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం

ఇప్పేరు, ముద్దులాపురం చెరువుకు నీరు తెచ్చిన ఘనత విశ్వాది..

విశ్వన్న గెలిస్తేనే ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి..

-యువనేత వై. ప్రణయ్ రెడ్డివిజయ సంకల్పయాత్ర..

కూడేరు ఏప్రిల్ 26( భారత్ న్యూస్)

అంతర గంగా ఇప్పేరు నాగిరెడ్డిపల్లికలగళ్ల గ్రామాలలో విజయసంకల్పయాత్ర లో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, వారి జీవితాల్లో వెలుగులు వుంటాయని వైస్సార్సీపీ యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ రెడ్డి అన్నారు. వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయన తనయుడు వై. ప్రణయ్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా పలు గ్రామాలలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లారు. ఫ్యాను గుర్తు కు ఓటు వేసి ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గెలిస్తేనే ఉరవకొండ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు ఇదొక్కసారి విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. కచ్చితంగా ప్రజలు ఆశించిన అభివృద్ధిని అందించి ఉరవకొండను ఆదర్శవంతగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, మండలం ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి భర్త అశ్విని హరీష్, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ తోపుదుర్తి రామాంజనేయులు, ఈ పేరు గ్రామపంచాయతీ సర్పంచ్ కుమారుడు నరసింహులు, ఉప సర్పంచ్ రామాంజనేయులు, ఇరికిల ధరంజి, అలాగే కిష్టప్ప, తిమ్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కేశన్న,నాగిరెడ్డిపల్లి సుబ్బయ్య, ఎస్టీషియల్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రచార విభాగ అధ్యక్షుడు శ్రీనివాసులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు యువ నాయకులు తదితరులు భారీ జన సమీకరణతోపాల్గొన్నారు.