హర్మూజ్‌లో కంటైనర్‌ నౌకపై దాడి

భారత్ న్యూస్ వరంగల్…..హర్మూజ్‌లో కంటైనర్‌ నౌకపై దాడి

హర్మూజ్‌ జలసంధిలో కంటైనర్‌ నౌకపై ఇరాన్‌ ఐఆర్‌జీసీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నౌకకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్రిటన్‌ మిలిటరీకి చెందిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ వెల్లడించింది. ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండో సారి కాల్పుల విరమణ చేసినప్పటికీ శాంతి చర్చలపై ఇంకా సందిగ్ధం వీడడం లేదు. హర్మూజ్‌ను అమెరికా నేవీ దిగ్బంధించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.