బీహార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏడుగురు నాయకులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బీపీసీసీ)

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీహార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏడుగురు నాయకులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బీపీసీసీ)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏడుగురిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీపీసీసీ

కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలంద జిల్లా నుండి రవి గోల్డెన్ లను సస్పెండ్ చేసిన అధిష్టానం

ఎన్నికల ఓటమికి సీనియర్ నాయకులను బాధ్యత నుండి కాపాడటానికి వీరిని సస్పెండ్ చేశారని అసమ్మతిని వ్యక్తం చేసిన మరో వర్గం