కండక్టర్లకు శాపంగా మారిన ఉచిత బస్సు పథకం

..భారత్ న్యూస్ హైదరాబాద్….కండక్టర్లకు శాపంగా మారిన ఉచిత బస్సు పథకం

రోజుకి రూ.5-6 వేలు టార్గెట్ తీసుకురావాలంటూ కండక్టర్లను వేధిస్తున్న ఆర్టీసీ అధికారులు

ఉచిత బస్సు పథకం వల్ల బస్సులలో 90% నుండి 95% వరకు మహిళలే ప్రయాణిస్తుండడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నగదు కలెక్షన్ పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు

దీంతో నగదు కలెక్షన్ పెంచాలని కండక్టర్లకు టార్గెట్లు నిర్ణయిస్తున్న అధికారులు

బస్సులు మొత్తం మహిళా ప్రయాణికులతో నిండిపోతుంటే, డబ్బులు ఎలా వస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కండక్టర్లు

ఉచిత బస్సు పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరగడంతో విధులు నిర్వహించడమే సాహసంగా ఉందంటే కొత్తగా ఇలా టార్గెట్లు పెడితే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్న కండక్టర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజులో 24 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 17 లక్షలు మహిళలే ఉంటున్నారని, బస్సులు మహిళలతో నిండిపోవడంతో పురుషులంతా క్యాబ్, మెట్రో, ఆటోల్లో ప్రయాణిస్తున్నారని ఆరోపిస్తున్న కండక్టర్లు

ఉచిత బస్సు పథకం పెట్టకముందు గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకి రూ.4 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వస్తుందని చెప్తున్న కండక్టర్లు

ఉచిత బస్సు పథకం వల్ల రోజు టికెట్ల మీద వచ్చే ఆదాయం తగ్గడంతో కొంతమంది డిపో మేనేజర్లు తమకు టార్గెట్లు పెడుతున్నారని, అది అసాధ్యమని స్పష్టం చేస్తున్న కండక్టర్లు