రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్

భారత్ న్యూస్ వరంగల్ …రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్

తెలంగాణ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారిని ఏసీబీకి పట్టుబడింది. బోరబండ GHMC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుండి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు••