bJp and brs who are deceiving bcs should be

భారత్ న్యూస్ హైదరాబాద్,

సాంబశివరావును, రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించండి. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు.
బీసీలతో సహా అన్ని వర్గాల ప్రజలను వంచించిన
బిజెపి,బీఆర్ యస్ లను శాసనసభ ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పాలని బీసీ హక్కుల సాధన సమితిరాష్ట్రఅధ్యక్షులుతాటిపాములవెంకట్రాములుపిలుపునిచ్చారు. బీసీ కుల గణన చేపట్టకుండా, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టకుండా మోడీ బీసీలకు తీరని అన్యాయం చేశారన్నారు.మతవాద నియంతృత్వ విధానాలతో కార్పొరేట్ శక్తులకు భూస్వామ్య దోపిడీ వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రజాకంటక పాలన చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు చరమగీతం పాడాలన్నారు. మోడీ కేసీఆర్ ప్రభుత్వాల విధానాలతో అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆర్థిక అసమానతలు అంతులేకుండా పెరిగాయని ,బడుగు బలహీన వర్గాలపై మహిళలపై మైనార్టీల పై దాడులు నిత్య కృత్యమైనాయని ప్రజలకురక్షణలేనిపరిస్థితిఏర్పడిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, యువతకు ఉద్యోగాలు, దళిత బంధు ,బీసీ బంధు, గృహలక్ష్మిపథకాలన్నీకాగితాలపైననేయున్నాయని,విద్యవైద్యసౌకర్యాలుకరువైనాయన్నారు. నాటి దొరల గడీల పాలననుతలపిస్తున్న పాలకులకు గుణపాఠం చెప్పేందుకుడబ్బు,మద్యం,ఎలాంటిప్రలోభాలకులొంగకుండసిపిఐ,సిపిఎం,తెలంగాణజనసభ,బీసిసంఘాలువివిధప్రజాసంఘాలుబలపరుస్తున్నకొత్తగూడెంలోసిపిఐఅభ్యర్థికూనంనేనిసాంబశివరావును,రాష్ట్రంలోకాంగ్రెస్అభ్యర్థులను గెలిపించాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.