పాకాల మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నివాళి
పాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం పాకాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించినారు.ప్రజల గుండెల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని తెలిపారు.అణగారిన ప్రజల వాస్తవ స్థితిగతులను గుర్తించి వాటి పరిష్కారంలో ప్రపంచానికే ఓ దిక్సూచిగా నిలిచిన మహాపురుషుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.ప్రపంచ మానవ చరిత్రలోనే గొప్ప విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.పోరాట యోధుడు మేధావి,విజ్ఞాని,ప్రపంచానికే నిలువెత్తు ఆదర్శమూర్తి అంబేద్కర్ తరతరాలుగా దోపిడీకి గురవుతున్న పేద,దళిత,బడుగు,బలహీన వర్గాల వారికి అండా,దండా అంబేద్కర్ అని అన్నారు.
అంబేద్కర్ మాత్రం ఎన్నటికీ పేద,అణగారిన వర్గాల పక్షపాతి అని చెప్పారు.