Nandyala Parliament Telugu Desam Party Incharge Mandra Sivananda Reddy and

నందికొట్కూరు భారత్ న్యూస్ ప్రతినిధి
నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గౌరు వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ వర్ధంతి.. సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిత్త జయసూర్య మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అని కోనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి.. అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారనీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో విద్యతో పాటు వారికి సరైన హక్కులను కల్పించడంలో సక్సెస్ అయ్యారని . దీంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త అలాగే, సంఘ సంస్కర్త కూడా అయినటువంటి ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారనీ .. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారనీ . దళిత నేపధ్యం నుంచి వచ్చిన అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుపడుతూ భారత రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని పొందారనీ గిత్త జయసూర్య చెప్పుకొచ్చారు.
ఈకార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు ఎస్ ఎండీ జమీల్ మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, నాగముని, షకీల్ అహమ్మద్, ముర్తుజావలి,రసూల్, కళాకార్, రాజన్న, రాజు, చాంద్, కాంతారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మాబాషా,కుమార్, మోహన్, శ్రీను, గని, ఏసేపు, శేఖర్, రగడ, భరత్, ముత్తు, హుస్సేన్, బాబుసాహెబ్ జనసేన నాయకులు రవికుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.