kv rao who received the national best service

భారత్ న్యూస్ విజయవాడ,

జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కె వి రావు
(నవంబర్ 27, కొండేపి)
మాస్టర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కోడూరి వెంకటేశ్వర రావు జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్ట్ అధ్యక్షులు పూసపాటి బాలాజీ కార్తీక మాసం శ్రీ సాయి అన్న దాన కార్యక్రమం సందర్బంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవకులకు ఉత్తమ అవార్డ్ అందించారు. మాస్టర్ కె వి రావు ఈ సంవత్సరం అందించిన సేవలకు గాను జాతీయ పురస్కారాన్ని సాయి చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో ప్రముఖ ల సమక్షంలో అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవార్డ్ కి సెలెక్ట్ చేసిన బృందానికి ధన్యవాదములు తెలిపారు.ప్రతీ సంవత్సరం విద్యా, సామాజిక సేవలు కొనసాగిస్తానని తెలిపారు. నిరంతరం ప్రజా సేవా కార్యక్రమాలు చేసి పేదలకీ సేవ అందించే లక్ష్యం తో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఏ పి జె అబ్దుల్ కలాం, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తి తో వారి సంస్థ పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ కె. చక్రవర్తి మనం ఫౌండేషన్, ఎమ్ నాగిరెడ్డి, డి. మధు సూదన్ మరియు స్నేహితులు, శ్రేయోభిలాసులు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సాయి భక్తులు పాల్గొన్నారు.